ఏపీ ఎండోమెంట్స్ ట్రైబ్యునల్ చైర్మన్ నియామకం.
విజయవాడ, మార్చి 21,(పిన్ పాయింట్)
విజయవాడకు చెందిన రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి ఎన్. నాగరాజును ఏపీ ఎండోమెంట్స్ ట్రైబ్యునల్ చైర్మన్గా నియమిస్తూ ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి 3 సంవత్సరాలు
లేదా 65 సంవత్సరాల వయస్సు పూర్తి అయ్యే వరకు ఈయన నియామకం ఉంటుంది.



